లక్నో వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎలాగైనా సరే గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలవాలని అనుకున్న బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు స్టార్ యంగ్ క్రికెటర్ ముంబై కి చెందిన ఇషాన్ కిషన్. తను బౌలర్లను ఉతికి ఆరేశాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 94 రన్స్ చేశాడు.
ఇందులో 48 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు కిషన్. తను నాటౌట్ గా నిలిచాడు. ఇంకా ఆరు పరుగులు చేసి ఉంటే సెంచరీ నమోదు చేసేవాడు. అభిషేక్ శర్మ 17 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్సర్లతో 34 రన్స్ చేశాడు. ఇక అనికేత్ వర్మ కేవలం 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 3 సిక్సర్లతో 26 రన్స్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 231 భారీ స్కోర్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం ధాటిగానే ఆడింది. కానీ 19.5 ఓవర్లలోనే 189 పరుగులకే చాప చుట్టేసింది. మిచెల్ సాల్ట్ 62 రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీ ప్లేయర్లు తేలి పోయారు. దీంతో ఓటమి తప్పలేదు.