అణ్వాయుధ‌ దేశాల‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

ఇరాన్ దాడుల‌ను ఆప‌క‌పోతే జాగ్ర‌త్త

ఇజ్రాయెల్ – ప‌శ్చిమాశియాలో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇరు వురు త‌గ్గ‌డం లేదు. ఒక‌రిపై మ‌రొక‌రు దాడుల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. ఈ సంర‌ద్బంగా ఇజ్రాయెల్ దేశ అధ్య‌క్షుడు నెత‌న్యాహూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇరాన్ త‌న అణ్వాయుధాల తయారీని విర‌మించు కోవాల‌ని వార్నింగ్ ఇచ్చారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. అన్న‌ట్టుగానే ఊహించ‌ని రీతిలో అణు స్థావరాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడుల‌కు దిగింది. దెబ్బ‌కు ఇరాన్ చీఫ్ బంకుల్లో దాక్కున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదే స‌మ‌యంలో ఇజ్రాయెల్ దేశం అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించింది. డిఫెన్స్ ఫోర్సెస్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో ఆయా దేశాల‌ను హెచ్చ‌రించింది. మీరంతా ఇరాన్ ను ఆప‌క పోతే త‌దుప‌రి ల‌క్ష్యం మీరే అవుతారంటూ స్ప‌ష్టం చేసింది ఇజ్రాయెల్.

ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే యూఎస్, యూకే, రష్యా, ఇటలీ, హంగేరీ, కజకిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, చైనా, సౌదీ, కెనడా, ఈజిప్ట్, స్వీడన్, జర్మనీ, రొమేనియా, పోలండ్, ఆస్ట్రియా, లిథువేనియా, ఉక్రెయిన్ లను ధ్వంసం చేస్తుందని ఐడీఎఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ చేసిన తాజా వీడియో ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. మొత్తంగా ఈ దాడులు ఇత‌ర దేశాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. ఆయిల్ సంక్షోభం నెల‌కొనే అవ‌కాశం ఉంది.

Comments (0)
Add Comment