ఇజ్రాయెల్ – ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్దం కొనసాగుతోంది. ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి. క్షిపణులతో విరుచుకు పడింది ఆదివారం ఇరాన్ ఇజ్రాయెల్ పై. మరో వైపు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే అమెరికా రంగంలోకి దిగింది. విచక్షణా రహితంగా ఇరాన్ పై మూకుమ్మడిగా దాడులకు దిగడంతో ఒక్కసారిగా విస్మయానికి లోనైంది ఆ దేశం. మరో వైపు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు తల వంచే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ ప్రెసిడెంట్. ఇదే సమయంలో ఇజ్రాయెల్ కు తగిన రీతిలో బుద్ది చెబుతామని ప్రకటించారు.
ఈ తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ. ఇరాన్ పై అమెరికా చేపట్టిన దాడులు చరిత్రలో నిలిచి పోతాయని చెప్పారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. బలం , బలగం ఉంటేనే శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను, ట్రంప్ పూర్తిగా విశ్వసిస్తామని అన్నారు. ఇరు దేశాల బంధం ఇలాగే కొనసాగాలని, భవిష్యత్తులో కూడా ఉండాలని పేర్కొన్నారు ప్రధాని.
ఇరాన్ కండ కావరాన్ని తాము తల దించుకునేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము చెప్పినట్లు వింటే సరి లేక పోతే పుట్టగతులు ఆ దస్త్రశానికి ఉండవని పేర్కొన్నారు. ఇకనైనా అమెరికా, తమ దారికి రావాలని హితవు పలికారు బెంజిమన్ నెతన్యాహూ.