ప్రముఖ తమిళ సినీ నటుడు ఆర్యకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఐటీ దాడులు చేపట్టింది. ఆయనకు సంబంధించిన నివాసాలతో పాటు వ్యాపార సంస్థలపై కూడా ఏకధాటిగా సోదాలు నిర్వహిస్తోంది. ఆర్య నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. తాజాగా తను తన సోదరుడు సత్య నటించిన హార్రర్ చిత్రం డీడీ నెక్స్ట్ లెవల్ ను నిర్మించారు.
ఆదాయ పన్ను శాఖ గురువారం ఉదయం దాడులకు దిగింది. నటుడు, నిర్మాత ఆర్యతో సంబంధం ఉన్న చెన్నైలోని అన్నా నగర్ లోని సీ షెల్ హోటల్ తో పాటు మరికొన్ని వ్యాపార ఆఫీసులపై దాడులకు దిగింది. ఇదే సమయంలో తమిళనాడు, చెన్నైలోని అనేక ప్రాంతాలలో ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉండగా ఆర్య ఆస్తులు సంపాదిస్తున్నారే తప్పా వాటికి తగిన రీతిలో ఆదాయ పన్ను చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు రావడంతో ఐటీ శాఖ అధికారులు బృందాలుగా విడి పోయి ఏకకాలంలో దాడులకు దిగారు.
చెన్నైలోని అన్నా నగర్, వేలచేరి, కొట్టివాక్కం, కిల్పాక్ వంటి ప్రాంతాలలో ఉన్న సీ షెల్ రెస్టారెంట్ , దాని అనుబంధ సంస్థలు, శాఖలపై సోదాలు చేపట్టారు. ఆర్య కొంతకాలం క్రితం ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్ను కేరళకు చెందిన కున్హి మూసా అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్లు పేర్కొన్నాడు. ఆర్య ప్రముఖ నటి అయేషా సైగల్ ను పెళ్లి చేసుకున్నాడు. తను అఖిల్ అక్కినేని నటించిన అఖిల్ మూవీలో కీ రోల్ పోషించింది.