ద‌ళ‌ప‌తి బ‌ర్త్ డే గిఫ్ట్ జ‌న నాయ‌గ‌న్ గ్లింప్స్

విజ‌య్ త‌న సినీ కెరీర్ లో ఇదే ఆఖ‌రు చిత్రం

త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సూప‌ర్ స్టార్ హోదా పొందిన న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌న మేన‌రిజంతో ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేశాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 10 ల‌క్ష‌ల మందికి పైగా స‌న్నాహ‌క పార్టీ ఆవిర్భావ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. భార‌తీయ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో దివంగత ఎన్టీఆర్ 1983 తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశాడు.

సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి ఝ‌లక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఉమ్మ‌డి ఏపీలో ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చాడు. త‌మిళ‌నాట ఎంజీఆర్, జ‌య‌ల‌లిత రాజ్య‌మేలారు. ఇదే స‌మ‌యంలో న‌టుడు విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను ఇక సినిమాల‌లో న‌టించ బోనంటూ వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం త‌ను జ‌న నాయ‌గ‌న్ లో న‌టిస్తున్నాడు. షూటింగ్ శ‌ర వేగంగా కొన‌సాగుతోంది. తాజాగా త‌న మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త‌న పుట్టిన రోజున మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

ఇక నుంచి పూర్తి స్థాయిలో పాలిటిక్స్ కు అంకితం అవుతానంటూ వెల్ల‌డించాడు. దీంతో ఈ సినిమాపై భారీ ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి. జ‌న నాయ‌గ‌న్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఈ ప్రాజెక్టును ఇప్ప‌టికే కార్తీ మూవీతో ఫేమ్ అయిన హెచ్ .వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు ప్ర‌జా నాయ‌కుడు చిత్రానికి. ఇంకా త‌న పుట్టిన రోజుకు కొన్ని రోజులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. జూన్ 22న జ‌న నాయ‌గ‌న్ ఫస్ట్ గ్లింప్స్ రానుంద‌ని తెలిపారు.

Comments (0)
Add Comment