భార‌త టెస్టు జ‌ట్టు కెప్టెన్ గా జ‌స్ప్రీత్ బుమ్రా

ప్ర‌క‌టించిన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ

ముంబై – బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ భార‌త స్టార్ బౌల‌ర్, స్పీడ్ స్ట‌ర్ గా పేరు పొందిన ముంబైకి చెందిన జ‌స్ ప్రీత్ బుమ్రాకు బిగ్ ఛాన్స్ ఇచ్చింది. ఈ మేర‌కు టీమిండియా టెస్టు జ‌ట్టుకు కెప్టెన్ గా నియ‌మించింది. శ‌నివారం సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, స‌భ్యుల‌తో పాటు హెడ్ కోచ్ అజిత్ అగార్క‌ర్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా క్రికెట్ ఫ్యాన్స్ విస్తు పోయేలా బుమ్రాకే అవ‌కాశం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా అధికారికంగా వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా ముంబైకి చెందిన స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ టెస్టు క్రికెట్ ఫార్మాట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో కెప్టెన్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఈ ప‌ద‌వి కోసం ప‌లువురు ఆట‌గాళ్లు పోటీ ప‌డ్డారు. వారిలో ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చెందిన కేఎల్ రాహుల్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ నాయ‌కుడు శ్రేయాస్ అయ్య‌ర్ ఉన్నారు.

వీరంద‌రినీ కాద‌ని సెల‌క్ష‌న్ క‌మిటీ జ‌స్ ప్రీత్ బుమ్రా వైపు మొగ్గు చూపింది. దీంతో ఇక నుంచి అధికారికంగా త‌నే టెస్టు ఫార్మాట్ కు భార‌త దేశం త‌ర‌పున నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

Comments (0)
Add Comment