Javed Akthar Shocking :జావేద్ అక్త‌ర్ షాకింగ్ కామెంట్స్

దాడుల‌తో నోరు మూయిస్తే ఎలా..?

Javed Akthar : ముంబై – ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప‌రోక్షంగా కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. గ‌త కొంత కాలం నుంచి ఆయ‌న త‌న వాయిస్ ను పెంచుతూ వ‌స్తున్నారు. గ‌తంలో క‌ళాకారుల‌కు, సినీ రంగానికి చెందిన వారికి స్వేచ్ఛ అనేది ఉండేద‌ని కానీ అది నేడు లేకుండా పోయింద‌ని వాపోయాడు. పాల‌క ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌క పోవ‌డం దారుణ‌మన్నారు. ఏమ‌న్నా అంటే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తున్నారంటూ వాపోయారు జావేద్ అక్త‌ర్.

Javed Akthar Shocking Comments

ఓ యూట్యూబ్ ఛాన‌ల్ తో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌పై త‌న‌కు జాలి క‌లుగుతోంద‌న్నాడు. ఎందుకంటే క‌నీసం కేంద్రాన్ని ప్ర‌శ్నించ లేని స్థితిలోకి న‌టీ న‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, సాంకేతిక నిపుణులు వెళ్ల‌డం బాధ‌గా ఉంద‌న్నారు జావేద్ అక్త‌ర్(Javed Akthar). ఈడీ, సీబీఐ దాడులు చేస్తుందేమోన‌న్న భ‌యంతోనే వెనుకంజ వేస్తున్నార‌ని వాపోయాడు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపాయి.

ఈ సంద‌ర్భంగా హాలీవుడ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు గేయ ర‌చ‌యిత‌. అక్క‌డ ఎంద‌రో అధ్యక్షుడు ట్రంప్ కు వ్య‌తిరేకంగా మాట్లాడార‌ని, కానీ ఏనాడూ వారిపై దాడులు జ‌ర‌గ‌లేద‌ని గుర్తు చేశారు. కానీ ఇండియాలో ఏ మాత్రం నోరు జారినా , తమ అభిప్రాయాల‌ను చెప్పినా ప‌ట్టించుకునే స్థితిలో లేరంటూ మండిప‌డ్డారు జావేద్ అక్త‌ర్.

Also Read : Hero Vishal Health :న‌టుడు విశాల్ ఆరోగ్యం ప‌దిలం

CommentsJaved AktharShockingViral
Comments (0)
Add Comment