అహ్మదాబాద్ – శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకు పోతోంది ఈ జట్టు. పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. దాదాపు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ తరుణంలో టోర్నీ ఆరంభం నుంచి టీం విజయాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జోష్ బట్లర్. ఇదిలా ఉండగా ఈసారి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ టోర్నీ వాయిదా పడింది.
తిరిగి ప్రారంభం కావడంతో బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం మే 26వ తేదీ వరకే ఉంది. దీంతో ప్లే ఆఫ్స్ తో పాటు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు ఇంకా నిర్వహించాల్సి ఉంది. జూన్ 3వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కీలక పోరుకు సిద్దం చేసింది బీసీసీఐ. వాస్తవానికి కోల్ కతా లో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల రీత్యా మ్యాచ్ ను అహ్మదాబాద్ కు మార్చింది.
ఇదిలా ఉండగా గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం జోష్ బట్లర్ ను ఏకంగా రూ. 15.75 కోట్లకు కొనుగోలు చేసింది వేలం పాటలో. తన ధరకు న్యాయం చేశాడు. భారీ ఎత్తున పరుగులు చేశాడు. అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ లో ఉన్నాడు. ఈ తరుణంలో తనను తిరిగి రావాల్సిందిగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో టాప్ క్రికెటర్ కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో పడి పోయింది.