కర్ణాటక – కన్నడ సాహిత్యానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకంగా భావించే బుకర్ ప్రైజ్ 2025 సంవత్సరానికి గాను కన్నడ రచయిత్రి భాను ముస్తాక్ కు లభించింది. హార్డ్ ల్యాంప్ అనే పుస్తకం రాశారు తను. ఇది పూర్తిగా చిన్న కథలకు సంబంధించిన సంకలనం. ఈ కథలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. మరింత హత్తుకునేలా శైలి ఉండడం, ప్రభావానికి గురి చేసేలా రాయడంతో భాను ముస్తాక్ ను బుకర్ ప్రైజ్ కు ఎంపిక చేసినట్లు ఎంపిక కమిటీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా కన్నడ సాహిత్య చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును పొందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతే కాకుండా ముస్తాన్ దీపా భస్తీ రాసిన హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనే పుస్తకాన్ని కూడా భాను ముస్తాక్ అనువదించారు. లండన్ లో జరిగిన ఓ కార్యక్రమ్ంలో ఈ ఇద్దరు రచయిత్రులు కలిసి బుకర్ ప్రైజ్ షీల్డ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
ఇక హార్డ్ ల్యాంప్ పుస్తకం గురించి చెప్పాలంటే దీనిని భాను ముస్తాక్ 30 ఏళ్లలో తను ఎదుర్కొన్న అనుభవాలను కళ్లకు కట్టినట్లు రాసే ప్రయత్నం చేశారు. మానవ జీవితంలోంచి వచ్చే ప్రతి సన్నివేశం వెనుక కన్నీటి కథ ఉంటుందని పేర్కొన్నారు రచయిత్రి. ఆంగ్ల పాఠకులకు ఇది కొత్త అనుభవాన్ని మిగిలుస్తుందని అభిప్రాయపడ్డారు బుకర్ ప్రైజ్ జ్యూరీ చైర్ మాక్స్ పోర్టర్. ఇక కన్నడ ప్రాంతానికి చెందిన భానుష ముస్తాక్ ముస్లిం సమాజం నుంచి వచ్చారు. తను రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది కూడా.