దుమ్ము రేపుతున్న క‌త్తందుకో జానకి సాంగ్

మిత్ర మండ‌లి మూవీ పాట సోష‌ల్ మీడియాలో వైరల్

టాలీవుడ్ లో జాన‌ప‌దాలు ఝ‌ల్లుమంటున్నాయి. ఎక్క‌డ చూసినా అవే సాంగ్స్ వినిపిస్తున్నాయి. యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎవ‌రికి వారే త‌మ ప్ర‌తిభ‌కు ప‌దును పెడుతున్నారు. ఆ మ‌ధ్య‌న పాల‌మూరు పోర‌గాడు చేసిన సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తాజాగా జాన‌ప‌దాల‌ను అద్భుతంగా రాసే కాస‌ర్ల శ్యామ్ నుంచి మ‌రో పాట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి సింగిల్ క‌త్తందుకో జానకి మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. డిఫ‌రెంట్ గా రాశాడు గేయ ర‌చ‌యిత‌. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ పాట‌.

ఆర్ఆర్ఆర్ లో ఆస్కార్ అవార్డు పొందిన పాట‌ను పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ ను ప్రాణం పెట్టి పాడాడు. ఆర్ఆర్ ధ్రువ‌న్ ఈ పాట‌కు స్వ‌ర క‌ల్ప‌న చేశారు. ఇందులో ప్రియ‌ద‌ర్శి, విష్ణు ఓయి, రాగ్ మ‌యూర్, ప్రసాద్ బెహ‌రా కీల‌క పాత్రలు పోషించారు. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మ‌కంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

ఈ పాట త‌క్కువ కాలంలోనే అత్యంత జ‌నాద‌రణ పొందింది. రీల్స్ లో టాప్ లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా మిత్ర మండ‌లి బృందానికి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. బ‌న్నీ వాసు స‌మ‌ర్ప‌ణ‌లో బీవీ వ‌ర్క్స్ ఆధ్వ‌ర్యంలో సప్త అశ్వ మీడియా వర్క్స్ , వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు మిత్ర మండ‌లి చిత్రాన్ని. ఎస్. విజ‌యేంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిహారిక‌, స‌త్య‌, వీటివి గ‌ణేష్ , త‌దిత‌ర న‌టీటులు ముఖ్య భూమిక పోషించారు .

Comments (0)
Add Comment