Kayadu Lohar : మారి ముత్తు తమిళంలో, తెలుగులో తీసిన చిత్రం డ్రాగన్. ఇందులో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కీ రోల్ పోషించాడు. పూర్తిగా డిఫరెంట్ కథతో తెరకెక్కించాడు. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. విస్తు పోయేలా చేసింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా కయాదు లోహర్ , అనుపమ పరమేశ్వరన్ మనసు దోచుకున్నారు. కానీ ఎక్కువ మార్కులు మాత్రం బీహార్ కు చెందిన ముద్దుగుమ్మ కయాదు లోహర్(Kayadu Lohar) కు దక్కాయి.
Kayadu Lohar Get’s Bumper Offer
గతంలో తను తెలుగులో నటించింది. కానీ ఆశించిన మేర ఆడలేదు. ఈ సమయంలో వచ్చిన డ్రాగన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల మదిని దోచుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ప్రత్యేకించి ప్రదీప్ రంగనాథన్ నటన కంట తడి పెట్టించింది. యూత్ ను మెస్మరైజ్ చేసింది. కయాదు లోహర్ ఈ ఒక్క మూవీతో దేశ వ్యాప్తంగా నేషనల్ క్రష్ గా మారి పోయింది. దీంతో తమ సినిమాలలో నటించమంటూ పెద్ద ఎత్తున ఈ ముద్దుగుమ్మకు బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రధానంగా అటు తమిళంలో ఇటు తెలుగులో దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు తమ సినిమాలలో నటించమని. తాజాగా కయాదు లోహర్ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. తను ఏకంగా అర డజన్ సినిమాలకు పైగానే సంతకాలు చేసిందని ప్రచారం. ప్రస్తుతం తను ఇదయం మురళి అనే చిత్రం చేస్తోంది. శింబు నటించే మూవీకి కన్ ఫర్మ్ చేసింది. జీవీ ప్రకాష్ మూవీ ఇమ్మోర్టల్ లో కీ రోల్ పోషిస్తోంది. మలయాళంలో తారం చిత్రంలో నటిస్తోంది. విశ్వక్ సేన్ ఫంకీతో పాటు రవితేజ ప్రాజెక్టులో కూడా ఓకే చెప్పింది. ది ప్యారడైజ్ లో నాని సరసన నటించనుంది.
Also Read : Lokesh Kanagaraj Shocking :రాజమౌళి లాగా టైం ఎక్కువ తీసుకోను