ప్రైమ్ వీడియోలో ఉప్పు క‌ప్పురంబు

కీ రోల్ పోషించిన మ‌హాన‌టి కీర్తి సురేష్

సావిత్రి జీవిత క‌థ ఆధారంగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం మ‌హాన‌టితో దేశ వ్యాప్తంగా త‌న వైపు తిప్పుకునేలా చేసిన న‌టి కీర్తి సురేష్. త‌ను ఇటీవ‌లే పెళ్లి కూడా చేసుకుంది. కానీ న‌ట‌నా ప‌రంగా ఏ మాత్రం ఛాన్స్ వ‌చ్చినా వ‌దులు కోవ‌డం లేదు. ఈవెంట్స్ , యాడ్స్ ..ఇలా ప్ర‌తి దానిలో త‌ళుక్కున మెరుస్తోంది. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది.

తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఆమె న‌టించిన చిత్రం ఉప్పు క‌ప్పురంబు మూవీ ఓటీటీలో వ‌చ్చే జూలై నెల‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ అధికారికంగా ధ్రువీక‌రించారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ సంస్థ ప్రైమ్ వీడియో స్వంతం చేసుకుంది. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌ను ఎంచుకునే పాత్ర‌లు భిన్నంగా ఉంటాయి. త‌ను గ‌తంలో ప‌రుశురామ్ మ‌హేష్ బాబుతో తీసిన స‌ర్కారు వారి పాట‌లో కీ రోల్ పోషించింది కీర్తి సురేష్.

ఉప్పు క‌ప్పురంబు చిత్రం పూర్తిగా తెలుగులో చిత్రీక‌రించారు. ఈ మూవీ జూలై 4న స్ట్రీమింగ్ కానుంద‌ని ప్ర‌క‌టించారు. తాళ్లూరి రామేశ్వరి, సుహాస్, శత్రు కూడా నటించారు. సినిమా పూర్తిగా 1990ల నేపథ్యంలో సాగుతుంది. దక్షిణ భారతదేశంలోని లోతట్టు ప్రాంతంలోని చిట్టి జయపురం అనే కల్పిత గ్రామ నివాసితులు దాని సమాధి మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటుండగా ఈ రాబోయే వ్యంగ్య చిత్రం అనుసరిస్తుంది.

ఉప్పు క‌ప్పురంబు మూవీని వ‌సంత్ మారింగంటి ర‌చించారు. ఐవీ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో ప్ర‌సారం కానుంది.

Comments (0)
Add Comment