శ్రేయ‌స్ అయ్య‌ర్ పై కోల్ క‌తా ఓన‌ర్ ఫోక‌స్

రియ‌ల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో సూప‌ర్ షో

ముందున్న ల‌క్ష్యం కొండంత‌. ఇంకొక‌రైతే జ‌ట్టు ఓడి పోతుంద‌ని అనుకుంటారు. కానీ బ‌ల‌మైన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. తాను నిజ‌మైన ఆట‌గాడిన‌ని, సిస‌లైన కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. జ‌స్ట్ 41 బాల్స్ మాత్ర‌మే ఎదుర్కొని 7 ఫోర్లు 8 భారీ సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. క‌ళాత్మ‌క‌మైన షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌ను ద‌గ్గ‌రుండి జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించాడు. ముంబై బౌల‌ర్లను ఉతికి ఆరేశాడు. గ‌త ఏడాది ఐపీఎల్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ గా గెలిపించాడు. క‌ప్ ను చేతికి అందించాడు.

పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ యాజ‌మాన్యం ఊహించ‌ని రీతిలో భారీ ధ‌ర‌కు కొనుగోలు చేశారు ప్రీతి జింతా. అంద‌రూ ఆశ్చ‌ర్య పోయారు. కానీ ఆమె న‌మ్మ‌కాన్ని త‌ను గెలుచుకున్నాడు. 12 ఏళ్ల త‌ర్వాత పంజాబ్ ను ఫైన‌ల్ కు తీసుకు వెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో ఈసారి జ‌రిగే వేలం పాట‌లో మ‌రోసారి శ్రేయ‌స్ అయ్య‌ర్ ను చేజిక్కించు కోవాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం .

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఓన‌ర్స్ గా బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో, హీరోయిన్లు షారుక్ ఖాన్ , జూహీ చావ్లా ఉన్నారు. ఈసారి ఎంత ధ‌ర‌కైనా స‌రే శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ఓన్ చేసుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న ఆట‌తీరుతో , నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ మామూలోడు కాద‌ప్పా అంటున్నారు ఫ్యాన్స్. అయితే బీసీసీఐ ఎందుకు తాజా జ‌ట్టులో ఎంపిక చేయ‌లేదంటూ మండి ప‌డుతున్నారు.

Comments (0)
Add Comment