విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కుబేర దుమ్ము రేపుతోంది. డిఫరెంట్ కథతో దీనిని తెరకెక్కించాడు. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్ నటించారు. కింగ్ నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అద్భుతంగా తమకు ఇచ్చిన పాత్రల్లో లీనమై నటించారు. యాచకుడి పాత్రలో ధనుష్ లీనమై పోయాడు. ప్రతి ఒక్కరు తన నటనకు ఫుల్ మార్కులు వేస్తున్నారు.
ప్రస్తుతం విడుదలైన థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండి పోతున్నాయి. కుబేర సినిమా ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన లభిస్తుండడంతో శేఖర్ కమ్ముల ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టును కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. కథ డిఫరెంట్ గా ఉండడం, సంభాషణలు, పాటలు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఒక రకంగా కుబేర ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తన జీవితంలో మరిచి పోలేని పాత్ర యాచకుడి పాత్ర అంటూ పేర్కొన్నారు ధనుష్.
ఇంత బలమైన బజ్తో కుబేర ఇప్పటికే వారాంతంలో బాక్సాఫీస్ విజేతగా నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దేవా అనే బిచ్చగాడి పాత్ర పోషించిన ధనుష్ తన సహజ నటనకు విస్తృత ప్రశంసలు పొందుతున్నాడు. ఈ పాత్ర కోసం తమిళ నటుడు భారీ రూ. 30 కోట్లు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ సీబీఐ అధికారి దీపక్ అనే కీలక పాత్ర పోషించిన నాగార్జునకు రూ. 14 కోట్లు తీసుకున్నాడని, హీరోయిన్ రష్మిక మందన్నా రూ. 4 కోట్లు తీసుకుందని టాక్. దేవిశ్రీ ప్రసాద్ రూ. 3 కోట్లు పుచ్చుకున్నట్లు సమాచారం. స్వయంగా తను దర్శకత్వం వహించినందుకు గాను రూ. 5 కోట్లు తీసుకున్నాడని జోరందుకుంది.