ఇప్పుడు ఓటీటీల కాలం నడుస్తోంది. మలయాళ సినీ రంగానికి చెందిన ముద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కళ్లతో మాయ చేసేసే సత్తా ఉన్న నటిగా గుర్తింపు పొందింది. సినిమాల కంటే ఓటీటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ తో నటించింది.
ఇక రియాల్టీ షోస్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటు తెలుగు అటు హిందీలో కూడా బిజీగా మారి పోయింది నిత్యా మీనన్. తాజాగా హాట్ టాపిక్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. తను కీలక పాత్రలో కుమారి శ్రీమతిలో నటించింది. ఇది ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ దీనిని తీసింది. ప్రస్తుతం టీజర్ కూడా వచ్చేసింది.
ఇది భారతీయ తెలుగు భాషా నాటకం. నిత్యా మీనన్ తో పాటు అఘమర్షన్ , జయంత్ తాడినాడ, కౌశిక్ సుబ్రమణ్య , శ్రీనివాస్ అవసరాల నటించారు. దీనిని శ్రీనివాస్ రాశారు. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. ఈ ధారా వాహిక ను ఎర్లీ మాన్ సూన్ టేల్స్ బ్యానర్ పై ప్రియాంక దత్ , స్వప్నా దత్ నిర్మించారు. గౌతమి, తిరువీర్ కూడా ప్రధాన పాత్రల్లో నటించడం విశేషం.
కుమారి శ్రీమతి వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 28న స్ట్రీమింగ్ కానుంది. మంచి కథ, నేపథ్యం కలిగిన ఈ సీరీస్ ను చూసి తీరాల్సిందే.