శ్రీ‌వారి భ‌క్తుల‌కు కియోస్కుల ద్వారా ల‌డ్డూలు

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న టీటీడీ

తిరుమ‌ల – శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది టీటీడీ. స్వామి వారి ప్ర‌సాదం ల‌డ్డూల కోసం ఇబ్బందులు లేకుండా చేసేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి నిరీక్షించేందుకు వీలు లేకుండా చేసింది. ఈ మేర‌కు కియోస్కుల ద్వారా ల‌డ్డూల‌ను అందించ‌నుంది. ప్ర‌యోగాత్మ‌కంగా యంత్రాల‌ను ఏర్పాటు చేసింది. దీని వ‌ల్ల తిరుమ‌ల‌లోని ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ర‌ద్దీ త‌గ్గుతుంది. ఈ మేర‌కు ఈ సౌక‌ర్యాన్ని ప్రారంభించింది.

ఇక భ‌క్తులు త‌మ‌కు అద‌నంగా ల‌డ్డూ ప్ర‌సాదం అద‌నంగా పొందాల‌ని అనుకునే వారికి ఒక ర‌కంగా శుభ‌వార్త‌నేని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు అద‌న‌పు ల‌డ్డూలు కావాలనే భ‌క్తుల‌కు కౌంట‌ర్ల‌లో న‌గ‌దు చెల్లిస్తే ఇచ్చేవారు. దీనికోసం స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంద‌ని భ‌క్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిని గ‌మ‌నించిన టీటీడీ ఈ కొత్త ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది.

అద‌న‌పు ల‌డ్డూలు కావాలని అనుకుంటే భ‌క్తులు ముందుగా కియోస్క్ లు ఉన్న వ‌ద్ద‌కు వెళ్లాలి. అక్క‌డ త‌మ టికెట్ పై ఉన్న నెంబ‌ర్ ను న‌మోదు చేయాలి. ఎన్ని ల‌డ్డూలు కావాలో అందులో పేర్కొనాలి. ఆ త‌ర్వాత ల‌డ్డూల సంఖ్య‌కు కావాల్సిన డ‌బ్బుల‌ను యూపీఐ ద్వారా చెల్లించాలి. ఆ త‌ర్వాత ర‌శీదు వ‌స్తుంది. దానిని తీసుకు వెళ్లి ఇస్తే కౌంట‌ర్ల‌లో ల‌డ్డూల‌ను తీసుకోవ‌చ్చ‌ని తెలిపింది టీటీడీ.

ఇదే స‌మ‌యంలో టికెట్లు లేని భ‌క్తుల‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చింది. త‌మకు చెందిన ఆధార్ నెంబ‌ర్ల‌ను ఎంట‌ర్ చేసి రెండు ల‌డ్డూల చొప్పున కొనుగోలు చేయొచ్చ‌ని పేర్కొంది. ఆ సంఖ్య‌ను పెంచుతున్న‌ట్లు తెలిపింది టీటీడీ.

Comments (0)
Add Comment