బుల్లి తెర‌పై మ్యాడ్ స్క్వేర్ మూవీ

జూన్ 15న స్టార్ మా టీవీలో ప్ర‌సారం

సితార బ్యాన‌ర్ ప‌తాకంపై నిర్మాత నాగ‌వంశీ నిర్మించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఇది గ‌తంలో వ‌చ్చి స‌క్సెస్ అయిన మ్యాడ్ కు సీక్వెల్. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తాజా చిత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. కామెడీ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేసింది. ఆ త‌ర్వాత ఓటీటీలో దుమ్ము రేపింది. ఇప్పుడు బుల్లితెర‌పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. జూన్ 15న స్టార్ మా టెలివిజ‌న్ లో టెలికాస్ట్ అవుతుంద‌ని సినీ మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు.

టాలీవుడ్ కామిక్ హిట్ ‘MAD స్క్వేర్’ ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సాయంత్రం 6:30 గంటలకు ప్ర‌సారం కానుంది. ఈ చిత్రానికి క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో విష్ణు ఓయ్, సంగీత్ శోభన్, నార్నే నితిన్ , రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని పూర్తిగా యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ గా మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. ఆశించిన దానికంటే భారీ హిట్ టాక్ అందుకుంది. నిర్మాత‌కు ఫుల్ జోష్ నింపేలా చేసింది మ్యాడ్ స్క్వేర్.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన సంగీతం మ్యాడ్ స్క్వ్రేర్ కు అద‌న‌పు బ‌లాన్ని ఇచ్చేలా చేసింది. ప్రియాంక జవాల్కర్, రమ్య పసుపులేటి, మురళీధర్ గౌడ్ సహాయక పాత్రలు పోషించగా, రెబా మోనికా జాన్ ఒక ప్రత్యేక పాటలో కనిపించారు.

హాస్యం, స్నేహం, తాజా ప్రదర్శనల మిశ్రమంతో MAD స్క్వేర్ చిన్న తెరపైకి అడుగు పెడుతున్నందున విస్తృత టెలివిజన్ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు నిర్మాత‌లు.

Comments (0)
Add Comment