Manchu Mohan Babu: కాబోయే దంపతులను ఆశీర్వదించిన మోహన్ బాబు !

కాబోయే దంపతులను ఆశీర్వదించిన మోహన్ బాబు !

Manchu Mohan Babu: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2022లో రౌడీ బాయ్స్‌ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిల్‌ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డి అనే అమ్మాయితో ఆయనకు వివాహం కుదిరింది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి నిశ్చితార్ధం కూడా జరిగింది. త్వరలో వీరి పెళ్ళి జరగబోతుంది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందించే పనిలో బిజీగా ఉన్నారు దిల్‌రాజు. తాజాగా నిర్మాత దిల్ రాజు… నూతన వధూవరులతో కలిసి టాలీవుడ్ నటుడు మోహన్‌ బాబును(Manchu Mohan Babu) ఇంటికి వెళ్లి మరీ పెళ్లికి ఆహ్వానించారు. దీనితో కాబోయే నూతన వధువరులను మెహన్‌బాబు ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Manchu Mohan Babu – ‘సెల్ఫిష్‌’ తో బిజీగా ఉన్న ఆశిష్ రెడ్డి

‘రౌడీబాయ్స్‌’ సినిమాతో గత ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆశిష్‌… ఆశించిన విజయం అందుకోలేకపోయారు. దీనితో కాస్తా గ్యాప్ ఇచ్చిన ఆశీష్…. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. విశాల్‌ కాశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సెల్ఫిష్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ఇవానా హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఆశిష్‌ హీరోగా ఇటీవల మరో సినిమా పట్టాలెక్కింది.

Also Read : Balakrishna : బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ సినిమా రీ రిలీజ్ కి సిద్ధం

dil rajuMohan babu
Comments (0)
Add Comment