మంచు మోహన్ బాబు సమర్పిస్తున్న చిత్రం కన్నప్ప చిత్రం ఈనెల 14న ట్రైలర్ రిలీజ్ కానుంది. వాస్తవానికి ఇవాళ విడుదల కావాల్సి ఉండగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఉన్నట్టుండి కూలి పోయింది. 265 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళిగా కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు నటుడు మంచు విష్ణు. ఇలాంటి బాధాకర సమయంలో ట్రైలర్ వేడుక జరుపు కోవడం మంచిది కాదని పేర్కొన్నారు.
భారీ ఖర్చుతో కన్నప్పను తీశారు. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ విడుదల చేశారు. సాంగ్స్ కూడా రిలీజ్ కావడంతో మంచి స్పందన లభించింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి క్యాంపెయిన్ ప్రారంభించాడు మంచు విష్ణు. మొన్నటికి మొన్న గుంటూరులో వేడుక చేపట్టారు. అమెరికాలో ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. ఇదే సమయంలో కన్నప్పపై వివాదం అలుముకుంది. ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను కొందరు చోరీకి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశాడు మంచు విష్ణు.
దీనికి ప్రధాన కారకుడు తన సోదరుడు, నటుడు మంచు విష్ణు అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామన్నాడు. ఈ హార్డ్ డిస్క్ లో కీలకమైన సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఉన్నాయని తెలిపాడు. ఇదిలా ఉండగా పురాణ శివ భక్తుడు కన్నప్ప జీవిత ఆధారంగా రూపొందించారు కన్నప్ప. ఈ చిత్రంలో మంచు విష్ణు కీలక పాత్ర పోషించాడు. తనతో పాటు మధు శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, రాహుల్ రామకృష్ణ, మోహన్ బాబు, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్ , మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.
కన్నప్పను జూన్ 27న విడుదల చేస్తామని ప్రకటించారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు నటుడు మంచు విష్ణు.