ప్ర‌పంచంలో నాలాంటి వారు ఎవ‌రూ లేరు

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా షాకింగ్ కామెంట్స్

సంగీత స్వ‌ర మాంత్రికుడు ఇళ‌య రాజా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న ఎక్కువ‌గా మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డరు. మోదీ స‌ర్కార్ త‌న‌ను పెద్ద‌ల స‌భ‌కు ఎంపిక చేసి గౌర‌వాన్ని చాటుకుంది. ఇదే స‌మ‌యంలో ఓ వైపు స‌భ‌కు హాజ‌ర‌వుతూనే మ‌రో వైపు త‌న వృత్తి ధ‌ర్మాన్ని నిర్వ‌హిస్తూనే వ‌స్తున్నారు. త‌న‌తో సంగీతం చేయించుకునేందుకు వ‌చ్చిన వారికి మ‌రింత మెరుగైన పాట‌లు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వ‌య‌సు పైబ‌డుతున్నా, శ‌రీరం స‌హ‌క‌రించ‌క పోయినా సంగీతం మీద ఉన్న ఆస‌క్తి, అనుర‌క్తి త‌న‌ను ఉండ నీయ‌డం లేదంటూ పేర్కొన్నారు ఇళ‌య‌రాజా.

తాజాగా ఆయ‌న షష్టిపూర్తి సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇళ‌య‌రాజా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలో నాలాంటి వారు ఎవ‌రూ లేర‌న్నారు. ఉండేందుకు ఆస్కారం లేద‌న్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. గ‌తంలో దివంగ‌త , గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల సుబ్ర‌మ‌ణ్యంపై మండిప‌డ్డారు. నోటీసులు కూడా పంపించారు. త‌న అనుమ‌తి లేకుండా పాట‌లు పాడడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రూ గొప్ప వారే. దీనిపై మ‌న‌సు నొచ్చుకున్నారు ఎస్పీబీ. ఇప్పుడు ఆయ‌న లేరు. కానీ ఇళ‌య‌రాజా ఉన్నారు.

ఇళయ రాజాను సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది ఎస్పీబీనే. త‌ను భార‌తీరాజాకు ప‌రిచ‌యం చేశాడు. అయినా ఎందుక‌నో ఇద్ద‌రి మ‌ధ్య కొంత దూరం పెరిగింది. ఇక ష‌ష్టిపూర్తి సినిమా విష‌యానికి వ‌స్తే ఇళ‌య‌రాజా అందించిన పాట‌లు మంచి జ‌నాద‌ర‌ణ పొందాయి. సంగీతంలో చాలా మంది పేరు పొందిన వారంతా గురువుల వ‌ద్ద సంగీతం నేర్చుకున్నార‌ని, కానీ తాను ఎవ‌రి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేయ‌లేద‌ని చెప్పారు ఇళ‌య‌రాజా. దైవం వ‌ల్ల‌నే తాను ఈ స్థితికి చేరుకున్నాన‌ని చెప్పారు.

Comments (0)
Add Comment