Megastar : మెగస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. దేశాభివృద్ది కోసం పీఎం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి సంబంధించి వినోద రంగానికి చెందిన ప్రముఖులతో సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం విశేషం.
Megastar Chiranjeevi Happiness
దేశానికి చెందిన నటీ నటులు, ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నరేంద్ర మోడీ. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ , బాలీవుడ్ కు చెందిన నటీ నటులతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత దేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా మీడియా హబ్ గా ఎలా తీర్చి దిద్దాలనే దానిపై సూచనలు స్వీకరించారు పీఎం. ఈ కీలక కాన్ఫరెన్స్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, దీపికా పదుకొనే, హేమా మలిని హాజరయ్యారు బాలీవుడ్ నుంచి.
దక్షిణాది నుంచి కేవలం ముగ్గురికే అవకాశం దక్కింది. ఇందులో తమిళనాడు నుంచి రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అల్లా రఖా రెహమాన్ ఉండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి(Megastar), అక్కినేని నాగార్జున అటెండ్ అయ్యారు. పీఎం మోడీతో సమావేశం కావడం చెప్పలేని ఆనందంగా ఉందన్నారు.
Also Read : Beauty Sai Pallavi : బంపర్ ఆఫర్ సాయి పల్లవి డోంట్ కేర్