ఐపీఎల్ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య కీలక పోరుకు సిద్దమైంది. అమీ తుమీ తేల్చుకునేందుకు ఇరు జట్లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇరు జట్లు టోర్నీలో అద్భుతంగా ఆడాయి. విచిత్రం ఏమిటంటే ముంబై మొదటి నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఆ తర్వాత పుంజుకుంది. చివరకు టైటిల్ వేటలో నిలిచింది. ఇక కీలక లీగ్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఆజట్టు ఫైనల్ కు వెళుతుంది.
ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్ -2 లో తలపడనున్నాయి. ముంబై సేన ఇప్పుడు పూర్తి బలంతో ఉంది. గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది. సెమీస్ లోకి దూసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ జట్టు టైటిల్ పరంగా హాట్ ఫెవరేట్ లో ఉంది. బ్యాటింగ్ పరంగా రోహిత్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లు ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూస్తే బుమ్రా , చాహర్ , శాంటర్న్ , కర్ణ్ శర్మ లాంటి వాళ్లంతో బలంగా ఉంది.
ఇక పంజాబ్ పరంగా చూస్తే ఈ జట్టు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సూపర్ గా ఆడుతోంది. యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ప్రియాంశ్ ఆర్య, జోష్ , నేహాల్ వధేరా, స్థాయినిస్ , శశాంక్ సింగ్ బ్యాటింగ్ పరంగా బౌలర్ల భరతం పట్టేందుకు రెడీగా ఉన్నారు. అర్ష్ దీప్ , జేమీసన్, వైశాఖ్ తో చాహల్ తో బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది.