అమరావతి – అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపుల వ్యవహారం ఊపందుకుంది. గతంలో కేటాయించిన భూముల్లో కొన్ని రద్దు కాగా, మరికొన్నింటికి మార్పులు చేశామన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. తాజాగా మరో పది సంస్థలకు భూములు కేటాయించడంతో అమరావతిలో మళ్లీ సందడి మొదలైం రాదన్నారు.
జధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యిందని చెప్పారు నారాయణ. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొత్తం 16 అంశాలకు గాను 12 అంశాలు మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం పొందాయన్నారు. 2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలను కొనసాగిస్తూ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పారు. సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ ఆమోదం తెలిపామన్నారు.
జుయలాజికల్ ఆఫ్ సర్వే సంస్థకు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అలాగే స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు ఐదు ఎకరాల కేటాయింపు కొనసాగిస్తూ ఆమోద ముద్ర వేసినట్లు వెల్లడించారు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు మూడు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపామన్నారు. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.