ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర‌ని కార్చిచ్చు లాంటోడు

ఆస్కార్ అవార్డు గ్ర‌హీత కీర‌వాణి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఆస్కార్ అవార్డు విన్న‌ర్ , సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి. త‌ను సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం ఎంఎం ర‌త్నం నిర్మించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు నిధి అగ‌ర్వాల్ కీ రోల్ పోషిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఈ సంద‌ర్బంగా సినిమాకు సంబంధించి మూడో సాంగ్ అసుర హ‌న‌నం పేరుతో రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా పోరాట యోధుడైన రాజు గురించి వ‌ర్ణించేలా ఉంది.

పాట‌ను , ప‌వ‌ర్ స్టార్ క‌ళ్యాణ్ న‌ట‌న‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కీర‌వాణి. త‌ను ఆర‌ని కార్చిచ్చు లాంటి వాడంటూ పేర్కొన్నారు. ఈ సాంగ్ పూర్తిగా ప‌వ‌న్ హీరోయిజంను గుర్తుకు తెచ్చేలా సాగుతుంద‌న్నారు. పేద‌లు, అమ‌యాక ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసే నాయ‌కుడి పాత్ర‌ను పోషించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌ను ఏ పాత్ర‌కైనా స‌రిపోతాడు. వంద శాతం న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ సినిమా ప‌డుతూ లేస్తూ వ‌చ్చింది. ముందుగా డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా త‌ను మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లి పోయాడు.

ఆ త‌ర్వాత జ‌య‌కృష్ణ దీనిని టేకోవ‌ర్ చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ డేట్స్ కుద‌ర‌క చాలా ఆల‌స్య‌మైంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు నిర్మాత ఎంఎం ర‌త్నం. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో రికార్డ్ బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఉండ‌బోతోంద‌ని ప్ర‌క‌టించాడు. జూన్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపాడు.

Comments (0)
Add Comment