ఐపీఎల్ 2025 మెగా టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఆఖరు మ్యాచ్ లో చుక్కలు చూపించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది గుజరాత్ టైటాన్స్. తనతో జరిగిన కీ మ్యాచ్ లో తుక్కు రేగ్గొట్టింది. భారీ తేడాతో ఓడించింది. ఇదిలా ఉండగా ఈసారి జరిగిన 18వ సీజన్ లో ఆశించిన మేర రాణించలేక పోయింది జట్టు . దీనిపై ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఈ టోర్నీలోనే కీలక ప్రకటన చేయనున్నారని మహేంద్ర సింగ్ ధోనీ గురించి. దేశ వ్యాప్తంగా రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ సందర్బంగా స్పందించాడు జార్ఖండ్ డైనమెట్. మీడియాకు ఎదురు ప్రశ్న వేశాడు. తన రిటైర్మెంట్ పై ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ఇంకా టైముందంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. అలా అయితే చాలా మంది 22 ఏళ్లకే వైదొలగాల్సి ఉంటుందన్నాడు. ఒక్కోసారి ఆటగాడు ఫేమస్ అవుతాడని, ఇంకోసారి ఆశించినంతక ఆడక పోవచ్చన్నాడు ఎంఎస్ ధోనీ.
ఆట అన్నాక గెలుపు ఓటములు సహజమని స్పష్టం చేశాడు మాజీ స్కిప్పర్. ఐపీఎల్ టోర్నీలో 14 మ్యాచ్ లు ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇందులో 10 మ్యాచ్ లోలో ఓటమి పాలై 4 మ్యాచ్ లలో మాత్రమే గెలుపొందింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడాడు ధోనీ. ఈ సీజన్ ఆశించినంత జరగలేదు. కానీ గెలుపుతో విజయం సాధించామని చెప్పాడు. రిటైర్మెంట్ అంటారా దానికి ఇప్పుడు ఏమంత తొందర అంటూ ప్రశ్నించాడు.