Popular Music Director Ilayaraaja :సంగీతం ఎలా వస్తోందో నాకు తెలియదు

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా కామెంట్స్

Ilayaraaja : రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం‘షష్టిపూర్తి’. ఈ చిత్రానికి విశ్వ విఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraaja) సంగీతాన్ని అందించారు. త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

Ilayaraaja Comment

‘ఈ ఏజ్‌లో కూడా ఇలా సంగీతం చేస్తున్నారే అంటున్నాడు రాజేంద్రప్రసాద్.. ఈ ఏజ్‌లో సంగీతం చేయకూడదా? ఎలా చేస్తున్నారే అంటే పర్లేదు.. ఇలా చేస్తున్నారేంటి అంటున్నారు… చేయకూడదా రాజేంద్రపసాద్.. వీడు మావాడే.. వీడు వంశీ.. ఇలా ఒక గ్రూప్ వుండేది. వాళ్ళందరూ నా నా కంపోజింగ్ రూమ్ ముందు గలాటా చేసేవారు. నేను ఇక్కడకి వచ్చింది మాట్లాడ్డానికి కాదు. మాట్లాడానికి ఏమీ లేదు. ఈ సినిమాకి నేను చేసిన వర్క్ మీరు విన్నారు… వినబోతున్నారు.. వింటూనే వుంటారు.. ఆ నమ్మకం వుంది.

కీరవాణి రాసిన పాట పల్లవి వినిపించినప్పుడు, తన మనసులో నామీద వున్న ఆత్మ బంధాన్ని రాశారని నాకు అర్థమైంది. నా మీద వున్న అభిమానం కీరవాణిలో ఎప్పుడూ మారలేదు. సంగీత దర్శకుడు అవడానికి ముందు, సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన తర్వాత కూడా ఆయనకు నా మీద అభిమానం అలాగే వుంది. దేవుడు ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఆశీస్సులు అందించాలి. లాంగ్ లైఫ్ ఫేమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

మీరు చేసిన వేలాది పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది అని అడిగితే, ‘ఒకటా.. రెండా… నేను నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు.. సంగీతమే నాకు గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణంలోనే నేను సంగీతాన్ని ఆపేస్తాను… నాకు నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నాను అని చెప్పారు. కొత్త వారిని ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతోనే ష‌ష్టిపూర్తికి చేశాన‌న్నారు.

Also Read : Sampoornesh Babu Sensational :అన్న‌ద‌మ్ముల అనుబంధం శాశ్వ‌తం 

CommentsilayarajaViral
Comments (0)
Add Comment