Nandamuri Mokshagna: డిసెంబరు నుంచి బరిలోకి నందమూరి మోక్షజ్ఞ !

డిసెంబరు నుంచి బరిలోకి నందమూరి మోక్షజ్ఞ !

Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ మొదటి చిత్రం ఇప్పటికే ఖరారైంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించనున్న ఈ సినిమాని బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది దసరా సందర్భంగా లాంఛనంగా మొదలు కానున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దీని చిత్రీకరణ విషయమై ఐఫా అవార్డ్స్‌ వేడుకలో బాలకృష్ణ స్పందించారు. తన తనయుడు మోక్షు తొలి చిత్రాన్ని డిసెంబరులో ప్రారంభిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. దీనితో నందమూరి అభిమానులు బాలయ్య నట వారసుడు మోక్షు ఆరంగ్రేటంపై ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Nandamuri Mokshagna Movie Updates

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న చిత్రమిది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న సోషియో ఫాంటసీ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా దీన్ని ముస్తాబు చేయనున్నారు. దాదాపు రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ … త్వరలోనే ఇతర నటీనటులతో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Also Read : Vijay Deverakonda: యుద్ధ విద్యలో శిక్షణ తీసుకుంటోన్న విజయ్‌ దేవరకొండ !

Balakrishna NandamuriNandamuri MokshagnaPrasanth Varma
Comments (0)
Add Comment