Nayanthara : తమిళ సినీ రంగంలో టాప్ హీరో హీరోయిన్లుగా ఉన్న నయనతార(Nayanthara), ధనుష్ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ ఇద్దరూ కాపీ రైట్ విషయంలో కోర్టుకు ఎక్కారు. తీవ్ర వ్యాఖ్యలు చేసినా వీరిలో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి ఇద్దరి మధ్య రాజుకున్న ఆధిపత్య పోరు తీవ్ర వివాదానికి తెర తీసేలా చేసింది. ప్రస్తుతం ఇద్దరూ హాట్ టాపిక్ గా మారారు. మరింత వైరల్ అయ్యారు. ఇదిలా ఉండగా నటుడి నిర్మాణ సంస్థ ఏకంగా రూ. 1 కోటి పరిహారం కింద ఇవ్వాలని కోరింది. ఇందుకు సంబంధించిన కేసును వచ్చే నెల ఏప్రిల్ 9న విచారణకు స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది.
Nayanthara Shocking
ఇదిలా ఉండగా ధనుష్ కు చెందిన పుండర్ బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బియాండ్ ది ఫెయిరీ టేల్ లో తమిళ సినిమా నానుమ్ రౌడీ ధాన్ తెర వెనుక విజువల్స్ ను నటుడి పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకు శాశ్వతంగా నిషేధం విధించాలని , కోటి పరిహారం కింద ఇవ్వాలని కోరుతూ పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను ధనుష్ దాఖలు చేయడం విశేషం. ఇందులో నయనతార భర్త విఘ్నేష్ శివన్ అనైతిక ప్రవర్తనతో వ్యవహరించారంటూ ఆరోపించారు.
కాగా డాక్యుమెంటరీ విడుదలను నిలిపి వేయాలని కోరుతూ మధ్యంతర నిషేధ దరఖాస్తును జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ముగించిన తర్వాత రాంఝనా నటుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్యుమెంట్-డ్రామా ఇప్పటికే నవంబర్ 18, 2024న విడుదలైంది. కాబట్టి మధ్యంతర నిషేధం ఇప్పుడు కుదరదని స్పష్టం చేసింది కోర్టు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నయనతార. తన ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధనుష్ పై మండిపడింది.
Also Read : Hero Yash-JJ Perry : యశ్ టాక్సిక్ మూవీపై హాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్