నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2025 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది, వైద్య ప్రవేశ పరీక్షలో అత్యధిక ర్యాంక్ హోల్డర్లను వెల్లడించింది. neet.nta.nic.inలోని తుది మెరిట్ జాబితా ఆధారంగా, రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ జనరల్ కేటగిరీలో 99.9999547 అద్భుతమైన పర్సంటైల్ స్కోర్తో ఆల్ ఇండియా ర్యాంక్ 1 గా నిలిచాడు. మధ్య ప్రదేశ్ కు చెందిన ఉత్కర్ష్ అవధియా 2వ ర్యాంకు, మరాఠాకు చెందిన కృస్ణన్ జోషి 3వ ర్యాంక్ పొందాడు. ఢిల్లీకి చెందిన మృణాల్ కిషోర్ ఝా 4వ ర్యాంక్ పొందగా, ఇదే ప్రాంతానికి చెందిన అవికా అగర్వాల్ 5వ ర్యాంకు సాధించింది.
జనరల్ కేటగిరీ కింద గుజరాత్ కు చెందిన జెనిల్ వినోద్భాయ్ భయానీ 6వ ర్యాంకు పొందగా , పంజాబ్ కు చెందిన కేశవ్ మిట్టల్ 7వ ర్యాంకు, గుజరాత్ కు చెందిన ఝా భవ్య చిరాగ్ 8వ ర్యాంకు, ఢిల్లీకి చెందిన హర్ష్ కేదావత్ 9వ ర్యాంకు పొందాడు. మహారాష్ట్రకు చెందిన ఆరవ్ అగర్వాల్ 10వ ర్యాంకులు సాధించారు.
వివిధ వర్గాలకు కటాఫ్ స్కోర్లకు స్పష్టత తెచ్చే కేటగిరీ వారీగా కట్-ఆఫ్లను కూడా NTA వెల్లడించింది.
NEET UG 2025 ఫలితాలు మెడిసిన్ను అభ్యసించాలని అనుకునే విద్యార్థులలో సంచలనం సృష్టించాయి టాపర్లు మెడిసిన్ వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ర్యాంకులలో అత్యధికంగా ఉత్తరాది ప్రాంతానికి చెందిన విద్యార్థులే టాపర్స్ గా నిలిచారు.