ముంబై ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన నేహాల్ వ‌ధేరా

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్య‌ర్

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ -2 కీల‌క మ్యాచ్ లో దుమ్ము రేపింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్. క్వాలిఫ‌య‌ర్ -1లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో జ‌రిగిన మ్యాచ్ లో ఓట‌మి పాలైంది పంజాబ్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 203 ప‌రుగులు చేసింది. అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ సూప‌ర్ షో చేసింది. ముంబై ధాటిగా ఆడింది. పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసిన సంతోషం మిగ‌లేదు.

2024 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ షాన్ దార్ షో చేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ , నేహాల్ వ‌ధేరా దుమ్ము రేపారు. అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నారు. ఇద్ద‌రూ క‌లిసి ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించారు. ప్ర‌ధానంగా అయ్య‌ర్ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. కేవ‌లం 41 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న శ్రేయాస్ 87 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. త‌న జ‌ట్టును ముందుండి న‌డిపించాడు విజ‌య ప‌థంలోకి.

కెప్టెన్ కు తోడుగా యంగ్ క్రికెట‌ర్ నేహాల్ వ‌ధేరా రెచ్చి పోయాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. ఆడింది త‌క్కువ బంతులే అయినా 48 ప‌రుగుల‌తో విరుచుకు ప‌డ్డాడు. జోస్ ఇంగ్లిష్ 38 ర‌న్స్ చేశాడు.
అంత‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 203 ర‌న్స్ చేసింది. తిల‌క్ వ‌ర్మ 29 బంతుల్లో 44 ర‌న్స్ చేయ‌గా, సూర్య కుమార్ యాద‌వ్ 26 బంతుల్లో 44 ప‌రుగులు చేశాడు.జానీ బెయిర్ స్టో 24 బంతుల్లో 38 ర‌న్స్ చేశాడు. న‌మ‌న్ ధీర 18 బంతుల్లో 7 ఫోర్ల‌తో 37 ప‌రుగులు చేశాడు. ఈసారి క‌ప్ గెలిపించాల‌ని హార్దిక్ పాండ్యా చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ లేదు.

Comments (0)
Add Comment