New Chief Justice : ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గవాయ్(Justice Gavai) కొలువు తీరుతారు. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తెలియ చేశారు. తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. తన గురించి తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నారు. ఏదో ఒక రోజు ఈ దేశానికి అత్యున్నతమైన చీఫ్ జస్టిస్ పదవి వరించి తీరుతుందని అన్నారని, ఆయన అన్న మాటలు నిజం అయ్యాయని కన్నీటి పర్యంతం అయ్యారు సీజేఐ.
New Chief Justice of India
ఇదిలా ఉండగా జస్టిస్ గవాయ్ తండ్రి రామకృష్ణ సూర్య భాన్ గవాయి. ఆయన ఒక సామాజిక ఆలోచనా పరుడిగా గుర్తింపు పొందారు. సుప్రసిద్ద అంబేద్కరిస్ట్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపకుడు. ఆయన అనుచరులంతా ప్రేమగా దాదా సాహెబ్ అని పిలిచే వారన్నారు సీజేఐ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీజేఐ సంజీవ్ ఖన్నా స్థానంలో కొలువు తీరుతారు.
తాను ముందుగా ఆర్కిటెక్ట్ కావాలని అనుకున్నానని, కానీ తండ్రి కోరిక మేరకు న్యాయవాద వృత్తిని స్వీకరించానని చెప్పారు జస్టిస్ గవాయ్. నాగ్పూర్ విశ్వ విద్యాలయం నుండి లా డిగ్రీ పొంది మార్చి 16, 1985న ప్రాక్టీస్ ప్రారంభించారు. జస్టిస్ గవాయ్ తండ్రి 2015లో మృతి చెందారు. 1990 తర్వాత సీజేఐ నాగ్ పూర్ లో లాయర్ గా పని చేశారు. దేశం ఇప్పటి వరకు కలిగి ఉన్న న్యాయమూర్తులలో తను అత్యంత నిరాడంబరమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
Also Read : UPSC New Chairman 2025 :యుపిఎస్సి చైర్మన్గా అజయ్ కుమార్