సాక్షి మీడియాపై NHRC కేసు నమోదు

కొమ్మినేనికి రిమాండ్ ..కృష్ణంరాజు అరెస్ట్

న్యూఢిల్లీ – ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళా రైతుల‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఎంపీ లావు శ్రీ‌కృష్ణ దేవ‌రాయులు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ను ఆశ్ర‌యించారు. సుమోటోగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఎంపీ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసింది ఎన్ హెచ్ ఆర్ సీ. ఇప్ప‌టికే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు కొమ్మినేని శ్రీ‌నివాస రావుతో పాటు కృష్ణంరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్బంగా సాక్షి మీడియాపై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది.

వేశ్య‌ల రాజ‌ధాని పేరుతో ప్ర‌త్యేక‌మైన డిబేట్ నిర్వ‌హించారు జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు. ఈ చ‌ర్చా వేదిక‌లో విజ‌య‌వాడ‌కు చెందిన జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు అన‌లిస్ట్ గా పాల్గొన్నారు. ఇద్ద‌రూ క‌లిసి అన‌వ‌స‌రంగా నోరు పారేసుకున్నారు. అడ్డ‌దిడ్డంగా మాట్లాడుతున్న అన‌లిస్ట్ ను అడ్డు కోవాల్సిన కొమ్మినేని అభ్యంత‌రం పెట్ట‌లేదు. చివ‌ర‌కు చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మ‌రాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి.

దీంతో ఏపీ కూట‌మి స‌ర్కార్ వైసీపీని టార్గెట్ చేసింది. త‌మంత‌కు తాముగా త‌ప్పులు చేసేలా ప్రోత్స‌హిస్తోంది. ఈ విష‌యం తెలుసుకోలేని వైసీపీ నేత‌లు నోటికి వ‌చ్చిన‌ట్టు వాగుతున్నారు. ఇప్ప‌టికే గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యేను జైలుపాలు చేశారు. ఇంకొంద‌రిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వేచి చూస్తున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి తీరుతాన‌ని అంటున్నాడు.

Comments (0)
Add Comment