ట్రంప్ ఆహ్వానించినా వెళ్ల‌లేదు – మోదీ

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాన‌మంత్రి

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అమెరికా దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు. త‌న‌ను ర‌మ్మ‌ని ఆహ్వానించినా తాను వెళ్ల లేద‌న్నారు. జ‌గ‌న్నాథుడు కొలువు తీరిన ఈ పుణ్య భూమికి రావ‌డ‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. భువ‌నేశ్వ‌ర్ లో ప‌లు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌ల‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు మోదీ.

రాష్ట్రంలో త‌మ కూట‌మి కొలువు తీరి ఏడాది పూర్తి చేసుకుంద‌ని చెప్పారు. త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. ఇవాళ అన్ని రంగాల‌లో రాష్ట్రం ప‌రుగులు తీస్తోంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఒకే దేశం ఒకే ప్ర‌జ‌లు ఉండ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు ఉన్నాయ‌ని అన్నారు. అందుకే తాము ఈ సిద్దాంతానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. కొంద‌రు కావాల‌ని ప్ర‌జ‌ల్లో అయోమ‌యం సృష్టించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

అందుకే ఈసారి ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మికి కోలుకోలేని షాక్ ఇచ్చార‌ని పేర్కొన్నారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. వారిని ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌న్నారు. ఇటీవ‌ల కెన‌డాలో జ‌రిగిన జీ 7 స‌ద‌స్సులో కీల‌క‌మైన అంశాల గురించి ప్ర‌స్తావించ‌డం జ‌రిగింద‌న్నారు.

Comments (0)
Add Comment