PM Modi : ఢిల్లీ – ఆపరేషన్ సిందూర్ లో కీలకమైన పాత్ర పోషించిన త్రివిధ దళాలను అభినందించారు ప్రధాని మోదీ. మంగళవారం ఆయన ఆర్మీ ఎయిర్ బేస్ ను సందర్శించారు. భారత సాయుధ దళాలతో ముచ్చటించారు. వారిని అభినందించారు. ధైర్య సాహసాలను కొనియాడారు. మీరే నిజమైన హీరోలు, వీరులు అంటూ కొనియాడారు మోదీ. మీకు ఎల్లవేళలా దేశం యావత్తు రుణపడి ఉంటుందన్నారు. నిర్భయం , అంకిత భావం , అచంచలమైన నిబద్దతను కలిగిన మిమ్మల్ని కలుసుకునేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు.
PM Modi Interesting Comments
ఈ నినాదం కేవలం ఒక ప్రకటన కాదు, భారతిని రక్షించడానికి తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి సైనికుడి ప్రతిజ్ఞ ఇది అన్నారు. దేశానికి సేవ చేయాలనుకునే ప్రతి పౌరుడి స్వరం ఆపరేషన్ సిందూర్ లో ప్రత్యక్షంగా పాలు పంచుకుందని స్పష్టం చేశారు మోదీ(PM Modi). మన దళాలు దాయాది దేశానికి చుక్కలు చూపించాయని అన్నారు. ఇక నుంచి ముల్లుకు ముల్లుతోనే సమాధానం ఇస్తామన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించదని వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ కు.
ఇంకోసారి తమ వైపు చూడాలంటే జంకాలని అన్నారు. మధ్యవర్తిత్వాన్ని సహించే ప్రసక్తి లేదన్నారు ప్రధాని . ఇక నుంచి మౌనంగా ఉండబోమని ప్రకటించారు. తమ దేశం జోలికి వస్తే మట్టు బెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : IPL 2025 Final : జూన్ 3న గుజరాత్ లో ఐపీఎల్ ఫైనల్
PM Modi Interesting : సాయుధ దళాలకు మోదీ సెల్యూట్
నిజమైన హీరోలు..వీరులు మీరే
PM Modi : ఢిల్లీ – ఆపరేషన్ సిందూర్ లో కీలకమైన పాత్ర పోషించిన త్రివిధ దళాలను అభినందించారు ప్రధాని మోదీ. మంగళవారం ఆయన ఆర్మీ ఎయిర్ బేస్ ను సందర్శించారు. భారత సాయుధ దళాలతో ముచ్చటించారు. వారిని అభినందించారు. ధైర్య సాహసాలను కొనియాడారు. మీరే నిజమైన హీరోలు, వీరులు అంటూ కొనియాడారు మోదీ. మీకు ఎల్లవేళలా దేశం యావత్తు రుణపడి ఉంటుందన్నారు. నిర్భయం , అంకిత భావం , అచంచలమైన నిబద్దతను కలిగిన మిమ్మల్ని కలుసుకునేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పారు.
PM Modi Interesting Comments
ఈ నినాదం కేవలం ఒక ప్రకటన కాదు, భారతిని రక్షించడానికి తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి సైనికుడి ప్రతిజ్ఞ ఇది అన్నారు. దేశానికి సేవ చేయాలనుకునే ప్రతి పౌరుడి స్వరం ఆపరేషన్ సిందూర్ లో ప్రత్యక్షంగా పాలు పంచుకుందని స్పష్టం చేశారు మోదీ(PM Modi). మన దళాలు దాయాది దేశానికి చుక్కలు చూపించాయని అన్నారు. ఇక నుంచి ముల్లుకు ముల్లుతోనే సమాధానం ఇస్తామన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించదని వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ కు.
ఇంకోసారి తమ వైపు చూడాలంటే జంకాలని అన్నారు. మధ్యవర్తిత్వాన్ని సహించే ప్రసక్తి లేదన్నారు ప్రధాని . ఇక నుంచి మౌనంగా ఉండబోమని ప్రకటించారు. తమ దేశం జోలికి వస్తే మట్టు బెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : IPL 2025 Final : జూన్ 3న గుజరాత్ లో ఐపీఎల్ ఫైనల్