PM Modi Strong Warning :పాకిస్తాన్ తోక జాడిస్తే తాట తీస్తాం

నిప్పులు చెరిగిన ప్ర‌ధాని మోదీ

PM Modi : న్యూఢిల్లీ – భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. దాయాది పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి భార‌త్ వైపు చూసినా లేదా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా ఊరుకునేది లేద‌ని అన్నారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ప్ర‌తీసారి పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేస్తోంద‌ని, దీనిని మానుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఇంకోసారి చేస్తే ఊరుకోమ‌న్నారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్‌ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని ఈ దృశ్యాల‌ను యావ‌త్ ప్ర‌పంచ‌మంతా చూసింద‌న్నారు.

PM Modi’s Strong Warning to Pakistan

ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్‌ దుమ్ము దులిపేశామ‌న్నారు. న్యూ ఏజ్‌ వార్‌ ఫేర్‌లో కూడా మన శక్తిని చూపించామ‌న్నారు. 21వ శతాబ్దం యుద్ధ రీతిలో మేకిన్ ఇండియా ఆయుధాలు వినియోగించామ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని మోదీ. ఇది యుద్ధాల యుగం కాదన్నారు. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మ‌రోసారి వార్నింగ్ ఇచ్చారు ప్ర‌ధాని మోదీ. ఉగ్ర‌వాదులు ఎక్క‌డ ఉన్నా వెతికి ప‌ట్టుకుంటామ‌ని, వెతికి వెతికి చంపేస్తామ‌ని అన్నారు.

Also Read : Shastipoorthy Song Sensational :ష‌ష్టి పూర్తి మాటే న‌చ్చే సాంగ్ రిలీజ్

BreakingCommentsNational NewsPakistanPM ModiViralWarning
Comments (0)
Add Comment