విజయ్ దేవరకొండపై కేసు న‌మోదు

ఆదివాసుల‌ను అవ‌మానించాడ‌ని ఆరోప‌ణ‌

హైద‌రాబాద్ – యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో త‌ను వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. 500 ఏళ్ల కింద‌ట గిరిజ‌నులు కొట్టుకు చ‌చ్చారంటూ ఆరోపించాడు. గిరిజ‌న సంఘాల ఆందోళ‌న చేప‌ట్టాయి. విజ‌య్ పై కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు.

ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా ట్రైబ‌ల్ లాయ‌ర్స్ అసోసియేష‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌ను హీరో అయినంత మాత్రాన ఇత‌ర జాతుల‌ను కించ ప‌ర‌చాల‌ని ఉందా అని ఫైర్ అయ్యింది.

ఇదిలా ఉండ‌గా పహల్గామ్ దాడిని గిరిజన ఘర్షణలతో ముడిపెట్టి ఆదివాసీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఝ‌ల‌క్ ఇచ్చారు. దీనిపై గ‌తంలోనే వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు విజ‌య్ దేవ‌రకొండ‌. తాను ఎవ‌రినీ కావాల‌ని కించ ప‌రిచేలా వ్యాఖ్యానించ లేద‌న్నాడు. త‌న‌కు అంద‌రూ స‌మాన‌మేన‌ని పేర్కొన్నాడు. ఒక‌వేళ ఎవ‌రైనా మ‌నోభావాలు దెబ్బ‌తింటే త‌న‌ను మ‌న్నించాల‌ని కోరాడు యంగ్ హీరో. ఆదివాసీ సమాజాన్ని కించపరిచేలా ప్రకటనలు చేసినందుకు కొంత చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డాడు.

Comments (0)
Add Comment