Nani : బహు భాషా నటిగా గుర్తింపు పొందిన లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను ప్రస్తుతం నటించిన రెట్రో విడుదలకు సిద్దంగా ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఇందులో సూర్య తో పాటు తను కూడా కీ రోల్ పోషించింది. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని మాటను బయట పెట్టింది. తాను టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించానని, కానీ నేచురల్ స్టార్ నానితో నటించ లేదని తెలిపింది.
Nani-Pooja Hegde….
భవిష్యత్ ప్రాజెక్టులలో ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా నాని(Nani )తో నటించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసింది పూజా హెగ్డే. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో గతంలో టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. తను అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో నటించింది. ప్రభాస్ తో రాధే శ్యామ్ మూవీలో తళుక్కున మెరిసింది. మహేష్ బాబుతో శ్రీమంతుడులో కీ రోల్ పోషించింది. జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత మూవీలో నటించింది..మెప్పించింది. ఇక విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ్ సరసన ఎఫ్2 మూవీలో స్పెషల్ సాంగ్ తో మెస్మరైజ్ చేసింది.
ప్రస్తుతం జ్యోతిక, సూర్య స్వంత బ్యానర్ పై రెట్రో నిర్మించారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. తను తీసిన ప్రతి మూవీలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి జుగుస్స లేకుండా ఇంటిల్లిపాది చూసేలా తీస్తాడన్న పేరు ఉంది. ఇక రెట్రో మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు సూపర్ ఆదరణ లభించింది. పూజా హెగ్డే లుక్ మరింత ఆకట్టుకునేలా ఉంది. రెట్రోలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు టాక్.
Also Read : Hero Mahesh Babu-ED :సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు