ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ నటించిన రాజా సాబ్ నుంచి టీజర్ ఇవాళ రిలీజ్ అయ్యింది గ్రాండ్ గా. అంచనాలకు మించి తీశాడు దర్శకుడు. అద్భుతమైన సన్నివేశాలు, గగుర్పొడిచే హర్రర్, నవ్వులు పూయించే కామెడీ వెరసీ కొత్తగా ఉంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కెవ్వు కేక అంటున్నారు. రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకు పోతోంది. తనను డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన మారుతి ఇప్పుడు రాజా సాబ్ తో ముందుకు వచ్చాడు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాత.
దీనిని పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి తమిళ సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థామన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. తాజాగా సరిగ్గా చెప్పినట్టుగానే మూవీ మేకర్స్ ఉదయం 10.52 గంటలకు రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో ఎంపిక చేసిన థియేటర్లలో టీజర్ ను వీక్షించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పక్కింటి అబ్బాయి పాత్రలో నటించాడు. తనకు తోడుగా అందాల భామలు నిధి అగర్వాల్ తో పాటు మాళవిక మోహన్ నటించారు.
బాహు బలి తర్వాత సాహో, సలార్ , కల్కి సినిమాలు చేశాడు. ఇప్పుడు పూర్తిగా రొమాంటిక్ రోల్ లో ప్రభాస్ నటిస్తుండడం విశేషం. కథ నచ్చడంతో మారుతికి ఓకే చెప్పాడు. కానీ సినిమా చిత్రీకరణ విషయంలో కొంత ఆలస్యం జరగడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మారుతి. ప్రభాస్ అభిమానుల అంచనాలకు మించి రాజా సాబా ఉండబోతోందని ప్రకటించాడు. తను చెప్పినట్టే చేశాడు. టీజర్ ఇప్పుడు దూసుకు పోతోంది. ప్రభాస్ కు ఇది పక్కా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమంటున్నారు సినీ వర్గాలు.