Prakash Raj : గుడికి వెళ్లిన ప్రకాష్ రాజ్ పై భగ్గుమన్న అభిమానులు

తరుచూ మత రాజకీయాలను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ మీడియాలో, సోషల్ మీడియాలో ఘాటైన విమర్శలు చేస్తారు...

Prakash Raj : ఎప్పుడు ఏదో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌పై ఫ్యాన్స్ మరోసారి ఫైర్ అవుతున్నారు. తిరుపతి లడ్డు కాంట్రవర్సీ‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్‌కి మధ్యలో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ తాజాగా ‘X’ లో చేసిన ఓ ట్వీట్‌పై ఫ్యాన్స్ మరోసారి ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకెళ్తే . . తిరుపతి లడ్డు కాంట్రవర్సీ లో ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌పై వరుస ట్వీట్లతో ప్రకాష్ రాజ్(Prakash Raj) విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన ఫారెన్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేపాల్ రాజధాని ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నేపాల్ ప్రజల ఆతిథ్యానికి, ప్రేమకు కృతజ్ఞత తెలుపుతూ టెంపుల్ వీడియోని పోస్ట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్‌తో పాటు మరికొందరు ‘నువ్వు హిందూ ద్రోహివి ఆలయానికి ఎలా వెళ్తావు’ అంటూ ఫైర్ అవుతున్నారు.

Prakash Raj Visited…

తరుచూ మత రాజకీయాలను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ మీడియాలో, సోషల్ మీడియాలో ఘాటైన విమర్శలు చేస్తారు. దీంతో ఆయనపై సెక్యులర్, యాంటీ హిందూ అనే ముద్రలు పడిపోయాయి. ఈ క్రమంలో ఆయన తరుచుగా కొందరు విశ్వాసకులకు, ఫ్యాన్స్‌కి టార్గెట్‌గా మారారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పశుపతినాథ్ ఆలయాని సందర్శింటానికి వెళ్తే ఆమె క్రిస్టియన్ అని అక్కడి ప్రజలు ఆమె రాకని అడ్డుకున్నారు. అలాంటిది ప్రకాష్ రాజ్‌ని ఎలా అనుమతించారంటూ పలువురు సోషల్ మీడియా సాక్షిగా ప్రకాష్ రాజ్‌పై నిప్పులు చిమ్ముతున్నారు. కాగా ముందు చెప్పినట్లు సెప్టెంబర్ 30న ప్రకాష్ రాజ్ ఇండియాకి వచ్చి లడ్డు వివాదంపై మాట్లాడతారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read : Sai Durgha Tej : మేనమామల బాటలోనే ముందుకు వెళ్తున్న సుప్రీమ్ హీరో

Prakash RajUpdatesViral
Comments (0)
Add Comment