హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా కలకలం రేపింది తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇందులో కీలక పాత్రధారిగా ఉన్న సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును గత కొన్ని రోజులుగా సిట్ విచారిస్తోంది. ఈ సందర్బంగా ఆయన తొలుత వివరాలు చెప్పేందుకు నిరాకరించగా తన వద్ద పని చేసిన ప్రణీత్ రావు అసలు విషయం బయట పెట్టారు. తనకు ఏమీ తెలియదని, కేవలం ప్రభాకర్ రావు చెప్పడంతో తాను ఫోన్ ట్యాపింగ్ చేశానని వాంగ్మూలం ఇచ్చాడు.
ఇదే సమయంలో తను నోరు విప్పడంతో మనోడు అసలు వాస్తవాలు కక్కాడని టాక్. అప్పటి డీజీపీగా ఉన్న కేకే మహేందర్ రెడ్డి ఫోన్లను ట్యాపింగ్ చేయాలని చెప్పడంతో పై అధికారి కాబట్టి తాను తూచ తప్పకుండా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు చెప్పాడు ప్రభాకర్ రావు. దీంతో సిట్ అధికారులు అవాక్కయ్యారు. మరో వైపు తన ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. దీంతో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది.
ఇదిలా ఉండగా సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ ఒక్క రోజే 600 మంది ఫోన్లను ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు టీం. మావోయిస్టుల పేరు చెప్పి దీనిని చేపట్టినట్లు సమాచారం. మావోయిస్టుల పేరుతో అధికార , ప్రతిపక్ష , వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి, ఈటెల, అరవింద్ , రఘునందన్ ఫోన్ లు కూడా ట్యాప్ చేశారు. అంతే కాదు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు.