ఐపీఎల్ 2025 కథ ముగిసింది. కానీ ఇంకా ఆ జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. జస్ట్ 6 పరుగుల తేడాతో కప్ ను కోల్పోయింది ఆ టీమ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. కానీ కోట్లాది మంది అభిమానుల హృదయాలను పంజాబ్ గెలుచుకుంది. చివరి బంతి దాకా పోరాడిన తీరు పట్ల అందరూ ఫిదా అయ్యారు.
ఈ సందర్బంగా టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగు పెట్టిన పంజాబ్ జట్టును విజయ తీరాలకు చేర్చిన ఘనత తమ జట్టు నాయకుడు శ్రేయాస్ అయ్యర్ కే దక్కుతుందని పేర్కొంది జట్టు ఓనర్ , ప్రముఖ నటి ప్రీతి జింతా. క్వాలిఫయర్ 1లో ఓటమి పాలైనా క్వాలిఫయర్ 2లో బలమైన ముంబైని మట్టి కర్చడంలో కీలక పాత్ర పోషించాడు అయ్యర్. తను ఒక్కడే దగ్గరుండి గెలిపించాడు తుది పోరుకు చేర్చాడు. 41 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 8 భారీ సిక్స్ లతో 87 రన్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు.
ఈ సందర్బంగా ప్రీతి జింతా సామాజిక వేదిక ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకుంది. పంజాబ్ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం అంటూ కొనియాడింది. మీరందరూ సింహాల్లాగా పోరాడారంటూ ప్రశంసలు కురిపించింది. పేరు పేరునా మీకందరికీ అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొంది. రాబోయే రోజుల్లో మనం ఛాంపియన్లు అయ్యేందుకు రెడీ కావాలని కోరింది. ప్రత్యేకించి అయ్యర్ కు థ్యాంక్స్ తెలిపింది.