టాటా ఐపీఎల్ 2025 లో అద్భుతం చోటు చేసుకుంది. మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. విజేత ఎవరో తేల్చేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎవరూ ఊహించని రీతిలో అంచనాలు తలకిందులు చేస్తూ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 5 వికెట్ల తేడాతో బలమైన ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించింది. క్వాలిఫయర్ -2 మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది ఆరు వికెట్లు కోల్పోయి. టోర్నీలో భారీగా పరుగుల వరద పారించిన రోహిత్ శర్మ అసలైన మ్యాచ్ లో చేతులెత్తేశాడు. అయినా ఆ జట్టు బిగ్ స్కోర్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అద్భుతంగా ఆడింది. ప్రధానంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ షో చేశాడు.
ముంబై ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం 41 బంతులు మాత్రమే ఎదుర్కొని 87 కీలక రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకు తోడుగా నేహాల్ వధేరా, ఇంగ్లీష్ సూపర్ షోతో ఆకట్టుకున్నారు. ఒకరు 48 రన్స్ చేస్తే మరొకరు 38 పరగులతో దుమ్ము రేపారు. మ్యాచ్ విన్నింగ్ అనంతరం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు ఓనర్ ప్రీతి జింతా ఆనందం పట్టలేక పోయింది. తన జట్టుకు ఘనమైన గెలుపును అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఆలింగనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.