దిల్ రాజు అస‌హ‌నం టాలీవుడ్ లో క‌ల‌క‌లం

ప్ర‌భుత్వ అవార్డుల‌కు రాక పోతే ఎలా అని ఫైర్

తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో ప్ర‌ముఖ నిర్మాత‌గా దిల్ రాజుకు పేరుంది. త‌ను ఏది ప‌ట్టుకున్న అది బంగారం అవుతుంంద‌నే టాక్ కూడా అప్ప‌ట్లో ఉండేది. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో తీసిన గేమ్ ఛేంజ‌ర్ త‌న‌ను అధః పాతాళానికి వెళ్లేలా చేసింది. కానీ మ‌రో మెట్టు ఎక్కేందుకు దోహ‌ద ప‌డేలా చేశాడు మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి. త‌న‌ను న‌మ్మి గ‌తంలో తీసిన ఎఫ్ 1, ఎఫ్ 2లు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. కాసుల వ‌ర్షం కురిపించాయి.

సేమ్ ఇదే ఫార్ములాను న‌మ్ముకున్నాడు ద‌ర్శ‌కుడు. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టు కోవ‌డంతో ఫుల్ ఖుషీ అయ్యాడు దిల్ రాజు. గేమ్ ఛేంజ‌ర్ దెబ్బ‌కు రూ. 500 కోట్లు కోల్పోయాడు . కానీ ఇదే స‌మ‌యంలో విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేష్ , మీనాక్షి చౌద‌రితో క‌లిసి తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం ఊహించ‌ని బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దీంతో దిల్ రాజు అలియాస్ వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే క్ర‌మంలో త‌న‌ను ఏరికోరి ఎంచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ (టీఎఫ్‌సీ) కు చైర్మ‌న్ గా నియ‌మించాడు.

ఈ సంద‌ర్బంగా తెలంగాణ గ‌ద్ద‌ర్ ఫిలిం అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్ర‌మానికి చాలా మంది విజేత‌లు రాలేక పోయారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించాడు దిల్ రాజు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మానికి , ప్ర‌త్యేకించి పుర‌స్కారాలు ప్ర‌క‌టించిన‌ప్పుడు తీసుకునేందుకు అన్ని షూటింగ్ ల‌ను క్యాన్సిల్ చేసుకుని రావాల‌న్నాడు. ఇక నుంచి స‌హించే ప్ర‌స‌క్తి లేదంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఈ అవార్డుల కార్య‌క్ర‌మం పూర్తిగా రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ అల్లు అర్జున్ గా మారి పోయిందన్న విమ‌ర్శ‌లు లేక పోలేదు.

Comments (0)
Add Comment