Kajal-Tamannaah Shocking :క్రిప్టో క‌రెన్సీ కేసు త‌మ‌న్నా..కాజ‌ల్ కు షాక్

పుదుచ్చేరిలో పోలీసులు కేసు న‌మోదు

Tamannaah : ముంబై – బాలీవుడ్ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టీమ‌ణులకు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌మిళ‌నాడు లోని పుదుచ్చేరి పోలీస్ స్టేష‌న్ లో కేసు నమోదైంది. ఈ మేర‌కు క్రిప్టో క‌రెన్సీ కి సంబంధించి ప్ర‌మోట్ చేస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స‌ద‌రు కంపెనీలో పెట్టుబ‌డి పెట్టండి..భారీ ఎత్తున లాభాలు పొంద‌వ‌చ్చ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

Kajal-Tamannaah Shocking Case

ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున మోసానికి గురైన‌ట్లు తేలింది. దీంతో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా త‌మ‌న్నా భాటియా(Tamannaah), కాజ‌ల్ అగ‌ర్వాల్ కు నోటీసులు కూడా పంపించిన‌ట్లు స‌మాచారం. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. అన్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఇదిలా ఉండ‌గా ఈ అందాల భామ‌ల మాట‌లు న‌మ్మి తాము మోస‌పోయామ‌ని, లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు రూ.2.40కోట్లు వసూలు చేశారని అశోకన్‌ అనే విశ్రాంత అనే ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

Also Read : Popular Producer-Dil Raju :కాపీ రైట్ కేసులో దిల్ రాజుకు రిలీఫ్

Kajal AggarwalPolice CaseShockingTamannaah BhatiaViral
Comments (0)
Add Comment