మహారాష్ట్ర – మరాఠాలోని పూణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకున్నారు. ఉన్నట్టుండి వంతెన కూలి పోవడంతో భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారని, దాదాపు 25 మందికి పైగానే ఉండవచ్చని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి . ఈ ఘటన ఇంద్రాయణి నది వద్ద చోటు చేసుకుంది. ఇదే నదిపై వంతెన నిర్మించారు. ఉన్నట్టుండి ఇది కూలి పోయింది.
ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. అధికారికంగా ధ్రువీకరించారు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరారు. ఇదిలా ఉండగా చాలా మంది అడ్రస్ లేకుండా పోయారని , ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా కూలిపోయిన సమయంలో వంతెనపై ఉన్న దాదాపు 15 నుండి 20 మంది పర్యాటకులు ఉప్పొంగిన నదిలో పడి కొట్టుకు పోయినట్లు సమాచారం. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)తో సహా పోలీసులు, విపత్తు సహాయ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించారు, ఇద్దరు మహిళలు ఇప్పటికీ వంతెన కింద చిక్కుకున్నారు.