గుజరాత్ – అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఒక రకంగా యుద్దాన్ని తలపింప చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ జట్టులో మరోసారి రాణించాడు విరాట్ కోహ్లీ . తను 43 రన్స్ చేశాడు. ఆఖరున వచ్చిన జితేష్ శర్మ సూపర్ షో చేశాడు. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్న ఆర్సీబీకి తను ఆక్సిజన్ లా మారాడు. ఒక రకంగా చెప్పాలంటే భారీ స్కోర్ ముందు ఉంచడంలో తను కీ రోల్ పోషించాడు.
అనంతరం 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్ . జస్ట్ సిక్స్ రన్స్ తేడాతో పరాజయం పొందడం నిరాశకు గురి చేసింది ఆ జట్టు ఫ్యాన్స్ ను. యంగ్ క్రికెటర్ శశాంక్ సింగ్ 30 బంతులు ఎదుర్కొని 61 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. అద్భుతంగా ఆడాడు. చివరి బంతి వరకు తను చేసిన పోరాటం అద్భుతం అని చెప్పక తప్పదు.
ఇక జోష్ ఇంగ్లీష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనను కృనాల్ పాండ్యా బోల్తా కొట్టించాడు. ఒకవేళ తను క్రీజులో ఉండి ఉంటే కప్ తప్పనిసరిగా పంజాబ్ కు దక్కి ఉండేది. తను 23 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు ఒక ఫోర్ ఉంది. రజత్ పాటిదార్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంది. ఫుల్ ఫామ్ లో ఉన్న స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్ పై షెఫర్డ్ ను ప్రయోగించాడు. తన ప్లాన్ తప్పలేదు. ఫోర్ కొట్టేందుకు వెళ్లిన అయ్యర్ వికెట్ సమర్పించాడు. అంపైర్ ఔట్ ఇవ్వక ముందే తను క్రీజు నుంచి వెళ్లి పోయాడు.