టాలీవుడ్ లో అత్యంత జనాదరణ పొందిన దర్శకుడు, మాటలతో బుల్లెట్లు కురిపించేలా చేసే దమ్మున్నోడు పూరీ జగన్నాథ్. తను రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన వాడు కాబట్టి కాస్తంత పొగరు కూడా ఉంటుంది. తను తీసే ప్రతి మూవీలో హీరో రెక్ లెస్ గా ఉంటాడు. సొసైటీ పట్ల బాధ్యత లేకుండా ఉన్నట్లు కనిపిస్తాడు. ఇది పూరీ స్టైల్. విచిత్రం ఏమిటంటే పూరీ జగన్నాథ్ టైటిల్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి.
ఇడియట్, పోకిరి, ఇస్మార్ట్ శంకర్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, లైగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఎక్కువగా రవితేజతో తీశాడు. రామ్ చరణ్ తో చిరుత తీశాడు. అనుష్క శెట్టిని ఈ మూవీ ద్వారా సినీ రంగానికి పరిచయం చేశాడు. బిచ్చగాళ్లని తేలికగా చూడొద్దని, వాళ్లు కూడా మనుషులేనని ఆలీ, బ్రహ్మానందంతో సూపర్ కామెడీ , స్పష్టమైన మెస్సేజ్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్.
తను తాజాగా సంచలన ప్రకటన చేశాడు. పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా బజ్ పెరిగి పోయింది ఈ మూవీపై. ఈ విషయాన్ని ఇద్దరూ ధ్రువీకరించారు కూడా. ఇక ఇప్పుడు తమిళం, తెలుగు ఆడియన్స్ లలో మంచి పేరుంది తనకు. ఇక హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు.
ఇక హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ టబు, రాధికా ఆప్టే ఎంపికైనట్లు ప్రచారం జరిగింది. కానీ రాధికా కాకుండా తన స్థానంలో మలయాళ బ్యూటీ నివేదితా థామస్ ను ఖరారు చేసినట్లు టాక్. ఇదే నెలలో షూటింగ్ స్టార్ట్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. పూరీ కనెక్ట్స్ పతాకంపై చార్మి కౌర్ నిర్మిస్తున్నారు మూవీని. ఈ సినిమాకు బెగ్గర్ అని టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.