Raashii Khanna: ‘యోధ’ టీజర్ డేట్ ను ప్రకటించిన రాశి ఖన్నా !

'యోధ' టీజర్ డేట్ ను ప్రకటించిన రాశి ఖన్నా !

Raashii Khanna: ‘ఊహాలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… గోపీచంద్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగార్జున, రవితేజ, ఎన్టీఆర్ వంటి బడా స్టార్లతో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా. 2013లో “మద్రాస్ కెఫె”లో భారత ఇంటలిజెన్స్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా… ఈ తరువాత తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ దక్షిణాది అగ్రతారగా గుర్తింపు పొందింది. అయితే వెండితెరకు కాస్తా గ్యాప్ ఇచ్చిన రాశి ఖన్నా(Raashii Khanna)… ఇటీవల సాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫర్జీ’ వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ ఏడాది మరల వెండితెర లోటును తీర్చేయడానికి వరుస సినిమాలతో వస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ యువ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘యోధ’ సినిమాలో నటిస్తోంది.

Raashii Khanna Announced

కరణ్‌ జోహార్‌ నిర్మాతగా… పుష్కర్‌ ఓఝా, సాగర్‌ అంబ్రే సంయుక్తంగా తెరకెక్కిస్తున్న‘యోధ’ సినిమాలో సిద్ధార్ధ్ మల్హోత్రా సరసన రాశి ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్ డేట్ ను రాశి ఖన్నా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘యోధ’ సినిమా టీజర్ విడుదల తేదీని తెలుపుతూ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఈ అద్భుతమైన ప్రయాణానికి మీ అందరితో కలిసి ముగింపు పలికేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. చూస్తూ ఉండండి ‘యోధ’ యాక్షన్‌ మొదలు కానుంది. టీజర్‌ 19న రాబోతుంది’ అంటూ కామెంట్ పెట్టింది. విమానం హైజాక్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా పోస్ట్ చేసిన వీడియో వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపై వైరల్ గా మారుతోంది.

Also Read : Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్‌ ‘సత్య’ కు 8 అంతర్జాతీయ అవార్డులు !

Karan JoharRaashii KhannaSidharth Malhotra
Comments (0)
Add Comment