చెన్నై – రాజస్థాన్ రాయల్స్ స్టార్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ షో తో చెన్నై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో స్వంత గడ్డపై కోలుకోలేని షాక్ తగిలింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నైనిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 రన్స్ రాజస్థాన్ రాయల్స్ ముందు లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం మైదానంలోకి దిగిన రాజస్థాన్ సూపర్ షో చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ , వైభవ్ సూర్య వంశీ చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. కళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపారు.
జైశ్వాల్ 36 రన్స్ చేయగా వైభవ్ సూర్య వంశీ ఉతికి ఆరేశాడు. కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 57 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. జైశ్వాల్ నిష్క్రమణతో మైదానంలోకి దిగిన కెప్టెన్ సంజూ శాంసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను 41 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. చెన్నై స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన అద్భుతమైన బంతులతో బోల్తా కొట్టించాడు.
సంజూ శాంసన్ సిక్స్ కొట్టబోయి తన చేతికి చిక్కాడు. ఆ వెంటనే సూపర్ ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీని తన కళ్లు చెదిరే బంతికి చిక్కేలా చేశాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లకు ఝలక్ ఇచ్చాడు. బరిలోకి దిగిన రియాన్ పరాగ్ ను నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో చెన్నై కొంచెం ఒత్తిడి పెంచినట్లయింది. కానీ ధ్రువ్ జురేల్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు చెన్నైకి. 188 రన్స్ ను 17.1 ఓవర్లలో పని పూర్తి కానిచ్చేశారు.