Rajat Patidar Shocking :పాటిదార్ కు గాయం మ్యాచ్ కు దూరం

మే 17న జ‌ర‌గ‌నున్న కీల‌క లీగ్ మ్యాచ్

Rajat Patidar : బెంగ‌ళూరు – ఐపీఎల్ మెగా టోర్నీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. ప్లే ఆఫ్స్ కు ద‌గ్గ‌రలో ఉంది. భార‌త్ , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుద‌ర‌డంతో ఐపీఎల్ ను తిరిగి నిర్వ‌హిస్తోంది బీసీసీఐ. ఈ మేర‌కు ఏర్పాట్లు కూడా చేసింది. మ‌రో వైపు ఫైన‌ల్ మ్యాచ్ వేదిక‌ను కోల్ క‌తా నుంచి గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ కు మార్చింది. ఆట‌గాళ్ల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా.

Rajat Patidar Shocking to IPL

ఇదిలా ఉండ‌గా టోర్నీలో భాగంగా కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది మే 17న . ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు. ఈ జ‌ట్టుతో అజింక్యా ర‌హానే సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ జ‌ట్టుకు గెలిచినా ఓడినా ఒరిగేది ఏమీ ఉండ‌దు. ఎందుకంటే ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్ర‌మించింది. ఇది ఒక ర‌కంగా చెప్పాలంటే తాత్కాలిక మ్యాచ్.

మ‌రో వైపు ఆర్సీబీకి కొత్త స్కిప్ప‌ర్ గా కొలువు తీరిన ర‌జ‌త్ పాటిదార్(Rajat Patidar) కు ఉన్న‌ట్టుండి గాయం కావ‌డంతో ఈ కీల‌క‌మైన మ్యాచ్ నుంచి దూరం కానున్నాడు. దీంతో త‌న స్థానంలో ఎవ‌రు కెప్టెన్ గా ఉంటార‌నేది ఉత్కంఠ నెల‌కొంది. మ్యాచ్ జ‌రిగేందుకు ఇంకా మూడు రోజుల స‌మ‌యం ఉంది. స్టాండింగ్ స్కిప్ప‌ర్ గా ఫ్లాఫ్ డుప్లిసిస్ వ్య‌వ‌హ‌రిస్తాడా లేక విరాట్ కోహ్లీ ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.

Also Read : AUS Cricket Board Shocking :బీసీసీఐకి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఝ‌ల‌క్

BreakingIPL 2025Rajat PatidarUpdatesViral
Comments (0)
Add Comment